Monday, 16 March 2026
  • Home  
  • పరీక్షల సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం – డా. బాలు సూచనలు
- తిరుపతి

పరీక్షల సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం – డా. బాలు సూచనలు

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని శ్రీకాళహస్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ప్రధాన వైద్యాధికారి డా. బాలు సూచించారు. సరైన ఆహారపు అలవాట్లు, విశ్రాంతి పాటిస్తే పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. పరీక్షల సమయంలో విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అధిక ఉప్పు, కొవ్వు, తీపి పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కడుపు మంట, జీర్ణ సమస్యలు, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇవి విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఇంట్లో తయారుచేసే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిదని, ముఖ్యంగా ఆకుకూరలు, కాయగూరలు వంటి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. అలాగే శరీరానికి శక్తినిచ్చే ద్రాక్ష, బత్తాయి, ఆపిల్ వంటి పండ్లరసాలు తీసుకోవాలని చెప్పారు. పరీక్షల సమయంలో రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం ద్వారా శరీరం, మనసు ప్రశాంతంగా ఉండి చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉండటంతో అలసట, నీరసం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు కనిపించినా వెంటనే సమీప వైద్యుడిని సంప్రదించాలని విద్యార్థులకు డా. బాలు సూచించారు.

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని శ్రీకాళహస్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ప్రధాన వైద్యాధికారి డా. బాలు సూచించారు. సరైన ఆహారపు అలవాట్లు, విశ్రాంతి పాటిస్తే పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. పరీక్షల సమయంలో విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అధిక ఉప్పు, కొవ్వు, తీపి పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కడుపు మంట, జీర్ణ సమస్యలు, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇవి విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఇంట్లో తయారుచేసే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిదని, ముఖ్యంగా ఆకుకూరలు, కాయగూరలు వంటి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. అలాగే శరీరానికి శక్తినిచ్చే ద్రాక్ష, బత్తాయి, ఆపిల్ వంటి పండ్లరసాలు తీసుకోవాలని చెప్పారు. పరీక్షల సమయంలో రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం ద్వారా శరీరం, మనసు ప్రశాంతంగా ఉండి చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉండటంతో అలసట, నీరసం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు కనిపించినా వెంటనే సమీప వైద్యుడిని సంప్రదించాలని విద్యార్థులకు డా. బాలు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.