Monday, 16 March 2026
  • Home  
  • తొట్టంబేడు మండలంలో ట్రాన్స్ఫార్మర్ చోరీలు….పంటలకు నీరు లేక రైతుల ఆవేదన
- తిరుపతి

తొట్టంబేడు మండలంలో ట్రాన్స్ఫార్మర్ చోరీలు….పంటలకు నీరు లేక రైతుల ఆవేదన

తొట్టంబేడు, మార్చి 16 (పున్నమి న్యూస్): తొట్టంబేడు మండలంలోని పెద్ద కనపర్తి, దయనేడు, చిట్టత్తూరు గ్రామాల్లో గత మూడు రోజులుగా వరుసగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురవుతున్న ఘటనలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో ట్రాన్స్ఫార్మర్లు దొంగిలించడంతో వరి పైరుకు చివరి తడి నీళ్లు కూడా వేయలేక రైతులు గుండెలు బాదుకుంటున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి పంటలు పండించిన రైతులు, అప్పు సప్పు చేసి మోటార్లు కొనుగోలు చేసి సాగు చేసినా ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ చోరీలతో పంటకు నీరు అందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనపర్తి గ్రామానికి చెందిన నెలవల గురవయ్య, రాఘవయ్య, రామ్మూర్తి, దయనేడు గ్రామానికి చెందిన జగదీష్, చిట్టత్తూరు గ్రామానికి చెందిన వి.సుబ్రహ్మణ్యం, పి.ప్రకాశ్ రెడ్డి, జై చిరంజీవి రెడ్డి లకు చెందిన ట్రాన్స్ఫార్మర్లు దొంగిలించబడినట్లు రైతులు తెలిపారు. ఈ ఘటనలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా ఎస్ఐ బాలకృష్ణ మాట్లాడుతూ.. ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్లు చోరీకి గురైన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

తొట్టంబేడు, మార్చి 16 (పున్నమి న్యూస్): తొట్టంబేడు మండలంలోని పెద్ద కనపర్తి, దయనేడు, చిట్టత్తూరు గ్రామాల్లో గత మూడు రోజులుగా వరుసగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురవుతున్న ఘటనలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో ట్రాన్స్ఫార్మర్లు దొంగిలించడంతో వరి పైరుకు చివరి తడి నీళ్లు కూడా వేయలేక రైతులు గుండెలు బాదుకుంటున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి పంటలు పండించిన రైతులు, అప్పు సప్పు చేసి మోటార్లు కొనుగోలు చేసి సాగు చేసినా ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ చోరీలతో పంటకు నీరు అందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనపర్తి గ్రామానికి చెందిన నెలవల గురవయ్య, రాఘవయ్య, రామ్మూర్తి, దయనేడు గ్రామానికి చెందిన జగదీష్, చిట్టత్తూరు గ్రామానికి చెందిన వి.సుబ్రహ్మణ్యం, పి.ప్రకాశ్ రెడ్డి, జై చిరంజీవి రెడ్డి లకు చెందిన ట్రాన్స్ఫార్మర్లు దొంగిలించబడినట్లు రైతులు తెలిపారు. ఈ ఘటనలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా ఎస్ఐ బాలకృష్ణ మాట్లాడుతూ.. ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్లు చోరీకి గురైన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.