పున్నమి ప్రతినిధి
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భముగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో గల తిరుమలాయ పాలేం మండలం సుబ్లేడు గ్రామం లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్యనారాయణ లు పాల్గొని జాతీయ జెండా ని ఆవిష్కరించారు. కొండ పల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నాడు నిజాం నిరంకుశ పాలన కీ వ్యతిరేకం గా తన కలమే ఆయుధం గా పోరాడిన ప్రముఖ పాత్రికేయుడు సోయబుల్లా ఖాన్ యొక్క స్వగ్రామం లో నేడు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకర విషయం అని అన్నారు. చావ కిరణ్, ఎల్లా రావు గౌడ్ భూక్యా శ్యాం సుందర్ నాయక్, తక్కేళ్లపల్లి నరేంద్ర, అనంతు ఉపేందర్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


