శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన పార్టీ నాయకులు స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలువేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్బంగా జనసైనికులు మాట్లాడుతూ……భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్లతో అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి దేశంలో ఉన్నటువంటి యువత యొక్క గుండెల్లో ధైర్యాన్ని నింపి, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా బ్రతకాలనే నినాదంతో అందరిని చైతన్యపరిచి భారతదేశ స్వాతంత్రం కోసం కేవలం 25 సంవత్సరాలకే ప్రాణదానం చేసి అందరిలోనూ ధైర్యాన్ని నింపిన చంద్రశేఖర్ ఆజాద్ ది ఒక గొప్ప చరిత్ర, ప్రతి ఒక్కరు కూడా ఆయనలో ఉన్నటువంటి ధైర్యాన్ని నింపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ, గంధం శీను, లక్ష్మణ్, కల్లిపూడి వెంకటేష్, ప్రదీప్ కుమార్, మహేష్, నవీన్, నాదెండ్ల రాజేష్, భాను, రాజా తదితరులు పాల్గొన్నారు.

చంద్రశేఖర్ ఆజాద్ సిద్దాంతాలను అనుసరిద్దాం-జనసైనికులు
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన పార్టీ నాయకులు స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలువేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్బంగా జనసైనికులు మాట్లాడుతూ……భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్లతో అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి దేశంలో ఉన్నటువంటి యువత యొక్క గుండెల్లో ధైర్యాన్ని నింపి, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా బ్రతకాలనే నినాదంతో అందరిని చైతన్యపరిచి భారతదేశ స్వాతంత్రం కోసం కేవలం 25 సంవత్సరాలకే ప్రాణదానం చేసి అందరిలోనూ ధైర్యాన్ని నింపిన చంద్రశేఖర్ ఆజాద్ ది ఒక గొప్ప చరిత్ర, ప్రతి ఒక్కరు కూడా ఆయనలో ఉన్నటువంటి ధైర్యాన్ని నింపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ, గంధం శీను, లక్ష్మణ్, కల్లిపూడి వెంకటేష్, ప్రదీప్ కుమార్, మహేష్, నవీన్, నాదెండ్ల రాజేష్, భాను, రాజా తదితరులు పాల్గొన్నారు.

