ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలం కోదండ రామపురంలో మహా రుద్ర యాగం – ప్రముఖుల పాల్గొనడం
మనుబోలు మండలంలోని కోదండ రామపురం గ్రామంలో ఘనంగా నిర్వహించిన మహా రుద్ర యాగంలో ప్రముఖ నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు.
వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యాగ కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి. శివభక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు యాగ మహిమను వివరించి, గ్రామ ప్రజలందరికీ శాంతి, శుభం, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు.
మహా రుద్ర యాగం సందర్భంగా కోదండ రామపురం గ్రామం భక్తి పరవశంతో కళకళలాడింది.



