పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం
రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ లో ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ మరియు ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాల ఆధ్వర్యంలో “AI, 3D ప్రింటింగ్ మరియు నియంత్రణ సంసిద్ధతకు నాణ్యత “హామి” అనే అంశం పై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు శనివారం నాడు విజయవంతంగా ముగిసింది. రెండో రోజున డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీన్కు చెందిన సతీష్ బాబు వక్తగా హాజరై భవిష్యత్ ఫార& సిస్టులకు అవసరమైన క్వాలిటీ మైండ్ సెట్ గురించి వివరించారు. అనంతరం శ్రీ ఆర్. చంద్రరేఖర్ జర్నల్ పేపర్ రచిన మరియు పరిశోధన విధానాల పై ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగాం నిర్వహించిన మాఖక మరియు ఈ-పోస్టర్ ఉత్తమ ప్రజంటేషన్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సదస్సు ద్వారా ఫార్మసీ రంగంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3 డి, ప్రింటింగ్ మరియు క్వాలిటీ అష్యూరెన్స్ వంటిఆధునిక సాంకేతికతల పై అవగాహన పెంపొందించడంలో ముఖ్యమైన వేదికగా నిలిచిందని సదస్సు కన్వీనర్లు శివగామి, సతీష్ కుమార్ తెలిపారు.




