అగనంపూడి, జనవరి ౩1, పున్నమి ప్రతినిధి
జీవీఎంసీ 85 వార్డు కొండయ్య వలస స్వర్ణ వార్డు పరిధిలో వయోపరిమిత వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ శనివారం ఉదయం నుంచి కూటమి నాయకులు పంపిణీ చేయడం జరిగింది. విశాఖ పార్లమెంటరీ టిఎన్టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం వచ్చినందున జనవరి 31 పెన్షన్స్ పంపిణీ చేయడం జరిగిందని. వితంతువులకు నూతన పెన్షన్స్ పంపిణీ పరిశీలన జరుగుతుందని, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పెంచి డబ్బులు అందజేయడం జరుగుతుందని, త్వరలో వీడ్కో ఇల్లు కూడా అర్హులైన వారికి ఇవ్వడం జరుగుతుందని, ఈ ప్రాంత ప్రజలకు సౌలాభ్యంగా అగనంపూడి 8వ జోన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఏవైనా సమస్యలు ఉంటే సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొండయ్యవలస స్వర్ణ వార్డు అడ్మిన్ మళ్ళ కోమల సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు వడ్డాది శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు పిల్లా శ్రీనివాసరావు, వెల్ఫేర్ కార్యదర్శి అనకాపల్లి హైమ, ఏఎన్ఎం రొంగలి వరలక్ష్మి పెన్షన్స్ దారులు పాల్గొన్నారు.



