శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం హోరెత్తింది. ఈ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి పాల్గొనగా, ఆమెతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి అడుగువేశారు. ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఒక ‘సంజీవని’ వంటిదని అభివర్ణించారు. కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన ఈ పథకం వల్లనే పల్లెల్లో పేదల వలసలు ఆగిపోయాయని, అట్టడుగు వర్గాలకు ఆర్థిక భరోసా కలిగిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, పథకం కొనసాగింపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఉద్యమాలకైనా వెనుకాడబోదని ఆయన హెచ్చరించారు. పేద ప్రజల ప్రయోజనాలే పరమావధిగా షర్మిల రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లా అధ్యక్షులు, వివిధ నియోజకవర్గ సమన్వయకర్తలు, మండల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.

ఉపాధి హామీ పేదల సంజీవని-షర్మిల రెడ్డి పాదయాత్రలో తలపా దామోదరం రెడ్డి
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం హోరెత్తింది. ఈ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి పాల్గొనగా, ఆమెతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి అడుగువేశారు. ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఒక ‘సంజీవని’ వంటిదని అభివర్ణించారు. కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన ఈ పథకం వల్లనే పల్లెల్లో పేదల వలసలు ఆగిపోయాయని, అట్టడుగు వర్గాలకు ఆర్థిక భరోసా కలిగిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, పథకం కొనసాగింపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఉద్యమాలకైనా వెనుకాడబోదని ఆయన హెచ్చరించారు. పేద ప్రజల ప్రయోజనాలే పరమావధిగా షర్మిల రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లా అధ్యక్షులు, వివిధ నియోజకవర్గ సమన్వయకర్తలు, మండల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.

