Thursday, 9 April 2026
  • Home  
  • ఆస్తి పన్ను బకాయిదారులకు శుభవార్త 50% వడ్డీ మాఫీ పొడిగింపు, 5% రాయితీ అవకాశం
- తిరుపతి

ఆస్తి పన్ను బకాయిదారులకు శుభవార్త 50% వడ్డీ మాఫీ పొడిగింపు, 5% రాయితీ అవకాశం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో ఆస్తి, ఖాళీ స్థల పన్ను బకాయిలు ఉన్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను బకాయిలపై విధించిన వడ్డీ మొత్తంలో 50 శాతం మాఫీ సదుపాయాన్ని ఏప్రిల్ 30, 2026 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఒకేసారి చెల్లించే వారికి 5 శాతం రాయితీ కూడా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని బకాయిలను త్వరగా చెల్లించాలని పన్ను చెల్లింపుదారులను కోరారు. పన్నులను పురపాలక కార్యాలయంలోని ప్రత్యేక కౌంటర్లలో, వార్డు సచివాలయాల్లో చెల్లించవచ్చు. అదనంగా, ఆన్‌లైన్ విధానంలో నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డులు, యూపీఐ, వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, అలాగే పురమిత్ర మొబైల్ యాప్ ద్వారా సులభంగా చెల్లించే సౌకర్యం కల్పించారు. ఈ సదవకాశం ఏప్రిల్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉండటంతో, బకాయిదారులు ఆలస్యం చేయకుండా పన్నులు చెల్లించి వడ్డీ మాఫీతో పాటు రాయితీ ప్రయోజనాలను పొందాలని పురపాలక సంఘం సూచించింది. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక కౌంటర్ల ద్వారా పన్ను చెల్లింపులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో ఆస్తి, ఖాళీ స్థల పన్ను బకాయిలు ఉన్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను బకాయిలపై విధించిన వడ్డీ మొత్తంలో 50 శాతం మాఫీ సదుపాయాన్ని ఏప్రిల్ 30, 2026 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఒకేసారి చెల్లించే వారికి 5 శాతం రాయితీ కూడా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని బకాయిలను త్వరగా చెల్లించాలని పన్ను చెల్లింపుదారులను కోరారు. పన్నులను పురపాలక కార్యాలయంలోని ప్రత్యేక కౌంటర్లలో, వార్డు సచివాలయాల్లో చెల్లించవచ్చు. అదనంగా, ఆన్‌లైన్ విధానంలో నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డులు, యూపీఐ, వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, అలాగే పురమిత్ర మొబైల్ యాప్ ద్వారా సులభంగా చెల్లించే సౌకర్యం కల్పించారు. ఈ సదవకాశం ఏప్రిల్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉండటంతో, బకాయిదారులు ఆలస్యం చేయకుండా పన్నులు చెల్లించి వడ్డీ మాఫీతో పాటు రాయితీ ప్రయోజనాలను పొందాలని పురపాలక సంఘం సూచించింది. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక కౌంటర్ల ద్వారా పన్ను చెల్లింపులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.