ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వే 2 న్యూస్ వారు నిర్వహించిన కాంక్లేవ్ లో మాట్లాడుతూ అమరావతిని భవిష్యత్తులో విస్తరిస్తాము అని వ్యాఖ్యనించారని అభివృద్ధి మొత్తం అమరావతికి కేంద్రీకృతం చేస్తే మళ్లీ ప్రాంతాల మధ్య అసమానతలకు దారి తీస్తుందని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి అన్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు సేకరించరాని అది అభివృద్ధి చేయడానికి 25 సంవత్సరాలు పట్టవచ్చని, ఇంక రాజధాని విస్తరణ అవసరం లేదని, రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాను ఒకో హబ్ గా అభివృద్ధి చేసే ప్రణాళిక చెయ్యాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోనే మొత్తం అభివృద్ధి కేంద్రీకృతం చేయకుండా రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చేసేలా ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఒప్పించాలని జనసేనను ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రజలు గత ఎన్నికల్లో ఆదరించారని వారి పక్షాన నిలబడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉందని ప్రియాంక అన్నారు.


