శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి హమాలీ ముఠా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏ పీ సీడ్స్ కార్పొరేషన్ విజయవాడ,వ్యవసాయ శాఖ మంత్రి గింజరపు అచ్చం నాయుడుకి మెమోరాండము సమర్పించిన ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ నాయకులు. విజయవాడలోని మంత్రి నివాసము నందు ఆయనను కలుసుకుని గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన కేంద్రం విజయవాడ శ్రీకాళహస్తితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న అన్ని బ్రాంచులు పూర్తిగా మూత పడిపోతున్న ఈ పరిస్థితులలో వేలాదిగా ఉన్న హమాలీ ముఠా కార్మికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని, విత్తన ప్రాసెసింగ్ యూనిట్లను వెంటనే తెరవాలని ఏపీ సీడ్స్ కార్పొరేషన్ కి సంబంధించిన అన్ని బ్రాంచీలలో పని విధానాన్ని మెరుగుపరచాలని మంత్రికి టియుసిసి ప్రతినిధి బృందం వివరించడం జరిగింది, వ్యవసాయ శాఖ మాత్యులు స్పందిస్తూ ఏపీ సీడ్స్ ని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో (టి యు సి సి)ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే,వీ నరసింహామూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులుయు, నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి దొడ్ల గౌరీ, హమాలీ నాయకులు మునయ్య, నంద్యాల గంగాధర్ లు పాల్గొన్నారు.

హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టియుసిసి మంత్రికి వినతి
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి హమాలీ ముఠా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏ పీ సీడ్స్ కార్పొరేషన్ విజయవాడ,వ్యవసాయ శాఖ మంత్రి గింజరపు అచ్చం నాయుడుకి మెమోరాండము సమర్పించిన ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ నాయకులు. విజయవాడలోని మంత్రి నివాసము నందు ఆయనను కలుసుకుని గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన కేంద్రం విజయవాడ శ్రీకాళహస్తితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న అన్ని బ్రాంచులు పూర్తిగా మూత పడిపోతున్న ఈ పరిస్థితులలో వేలాదిగా ఉన్న హమాలీ ముఠా కార్మికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని, విత్తన ప్రాసెసింగ్ యూనిట్లను వెంటనే తెరవాలని ఏపీ సీడ్స్ కార్పొరేషన్ కి సంబంధించిన అన్ని బ్రాంచీలలో పని విధానాన్ని మెరుగుపరచాలని మంత్రికి టియుసిసి ప్రతినిధి బృందం వివరించడం జరిగింది, వ్యవసాయ శాఖ మాత్యులు స్పందిస్తూ ఏపీ సీడ్స్ ని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో (టి యు సి సి)ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే,వీ నరసింహామూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులుయు, నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి దొడ్ల గౌరీ, హమాలీ నాయకులు మునయ్య, నంద్యాల గంగాధర్ లు పాల్గొన్నారు.

