
విశాఖపట్నం అక్టోబర్ 05
భారత పోస్టల్ శాఖ తన సర్వీసుల్లో భారీ అప్డేట్కి శ్రీకారం చుట్టింది. పాత పోస్టాఫీస్ ఇమేజ్ని తుడిచేస్తూ, ఆధునిక డిజిటల్ యుగానికి తగ్గట్టు స్పీడ్ పోస్టు సేవను పూర్తిగా రీడిజైన్ చేసింది.
🗓️ అక్టోబర్ 1, 2025 నుండి దేశవ్యాప్తంగా కొత్త రేట్లు, కొత్త ఫీచర్లు అమల్లోకి వస్తాయి.
ఇప్పుడు పోస్టు వస్తే కేవలం ట్రాకింగ్ నంబర్ కాదు — మీ ఫోన్లోనే OTP ద్వారా సురక్షిత డెలివరీ కన్ఫర్మ్ అవుతుంది. ప్రతి స్టేజ్లో SMS అలర్ట్స్ వస్తాయి, మీరు పంపిన లేఖ లేదా పార్సిల్ ఎక్కడుందో “రియల్ టైమ్ ట్రాకింగ్” ద్వారా చెక్ చేసుకోవచ్చు.
స్థానికంగా 50 గ్రాముల వరకు పంపేందుకు ₹19 నుంచి ప్రారంభం.
రిజిస్టర్డ్ పోస్ట్ ఇక స్పీడ్ పోస్ట్ లోనే
పోస్టల్ శాఖ రిజిస్టర్డ్ పోస్టు సేవను రద్దు చేయలేదని స్పష్టంచేసింది — దాన్ని స్పీడ్ పోస్టు వ్యవస్థలో విలీనం చేసి, మరింత వేగంగా, సురక్షితంగా, ట్రాకింగ్ సౌకర్యంతో అందుబాటులోకి తెస్తోంది.
ఏపీకి సిస్టమ్ ( అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ)
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ భాగంగా, దేశవ్యాప్తంగా 1.6 లక్షల పోస్టాఫీసుల్లో కొత్త సాంకేతిక వేదిక – ఏ పి టి సిస్టమ్ అమలవుతోంది. దీని వల్ల బుకింగ్, డెలివరీ, ట్రాకింగ్, డేటా మేనేజ్మెంట్ అన్నీ ఒకే సిస్టమ్లో నిర్వహించబడతాయి.
“ప్రజలకు మరింత వేగవంతమైన, సురక్షితమైన, పారదర్శకమైన సేవలు అందించడమే మా లక్ష్యం.”


