స్వర్గీయ దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి గారి జ్ఞాపకార్థంగా, మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామంలో సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ మినరల్ వాటర్ ప్లాంట్ను మా నాన్నగారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించడం గర్వకారణం. గ్రామాభివృద్ధి దిశగా ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ప్రజలకు మేలుచేసే కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా వారి ఆశయాలను నిలబెట్టుకోవడం మా కుటుంబ బాధ్యతగా భావిస్తున్నాం.



