ఏర్పేడు, మార్చి 27 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలంలోని చారిత్రాత్మక గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈవో) రామచంద్ర రెడ్డి పదవీ విరమణను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ముందస్తు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఘనంగా వీడ్కోలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బుగ్గ మఠం ఈవో మరియు అసిస్టెంట్ కమిషనర్ (AC) డి. వెంకటేశ్వర్లు, రామచంద్ర రెడ్డిని దుశ్శాలువతో కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. స్వామివారి సేవలో ఆయన చూపిన నిబద్ధతను ఈ సందర్భంగా కొనియాడారు. సన్మాన గ్రహీత రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. తన సేవా కాలంలో గుడిమల్లం దేవస్థాన సిబ్బంది మరియు భక్తులు అందించిన సహకారం మరువలేనిదని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి ఒక్కరికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సేవానిరతికి దక్కిన గౌరవం-గుడిమల్లం ఈవోకు ముందస్తు వీడ్కోలు.
ఏర్పేడు, మార్చి 27 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలంలోని చారిత్రాత్మక గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈవో) రామచంద్ర రెడ్డి పదవీ విరమణను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ముందస్తు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఘనంగా వీడ్కోలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బుగ్గ మఠం ఈవో మరియు అసిస్టెంట్ కమిషనర్ (AC) డి. వెంకటేశ్వర్లు, రామచంద్ర రెడ్డిని దుశ్శాలువతో కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. స్వామివారి సేవలో ఆయన చూపిన నిబద్ధతను ఈ సందర్భంగా కొనియాడారు. సన్మాన గ్రహీత రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. తన సేవా కాలంలో గుడిమల్లం దేవస్థాన సిబ్బంది మరియు భక్తులు అందించిన సహకారం మరువలేనిదని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి ఒక్కరికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

