*సెట్విస్ సీఈవోగా ఎం. రమ్య బాధ్యతల స్వీకరణ*
విశాఖపట్టణం, నవంబర్ పున్నమి ప్రతినిధి ః విశాఖపట్టణం సెట్విస్ నూతన సీఈవోగా మెట్ట రమ్య నియమితులయ్యారు. 2016 గ్రూప్ -1 బ్యాచ్ కు చెందిన ఈమె ఇప్పటి వరకు విశాఖపట్టణంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గా విధులు నిర్వర్తించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం స్థానిక జడ్పీ జంక్షన్ సమీపంలో ఉన్న సెట్విస్ కార్యాలయంలో శుక్రవారం ఈమె బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఇన్ఛార్జి సీఈవోగా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కె. కవిత అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.


