Monday, 16 February 2026
  • Home  
  • సూపర్ స్నేహితుల మిత్రబృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
- తిరుపతి

సూపర్ స్నేహితుల మిత్రబృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: శ్రీకాళహస్తి పట్టణంలో 13 రోజులు పాటు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రథోత్సవం రోజున సోమవారం నాడు సూపర్ స్నేహితుల మిత్రబృందం ఆధ్వర్యంలో భక్తులకు భారీ సంఖ్యలో అన్నప్రసాదాలు పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్బగా ఛైర్మెన్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి మాట్లాడుతూ… స్థానిక పానగల్ లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1982-83 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులందరు కలసి సూపర్ స్నేహితుల మిత్రబృందం అనే పేరిట ఒక గ్రూపుగా ఏర్పడి గత 16 ఏళ్ల నుంచి శ్రీకాళహస్తీశ్వరా స్వామీ-అమ్మవార్ల రథోత్సవం రోజున భక్తిశ్రద్ధలతో భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని నేడు సుమారుగా 2000 మందికి పైబడే రకరాల అన్న ప్రసాదాలు వితరణ చేశామన్నారు. తమ మిత్రబృందంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు, శుభకార్యక్రమాలు జరిగిన కలిసికట్టుగా ఉంటూ వారికి మేమున్నాం అంటూ భరోసాగా నిలబడుతున్నామని ప్రజలకు సేవ, సాయం చేయాలనే ఉద్దేశంతో తామంతా ఒక కమిటీగా ఏర్పడ్డామని అయన తెలిపారు. అన్నదాన సేవ అనంతరం అందరూ కలసి శ్రీ స్వామీ, అమ్మవార్ల దర్శనం చేసుకుని వేదపండితుల ఆశీర్వాదం పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ స్నేహితుల మిత్రబృందం ప్రెసిడెంట్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, ప్రధాన కార్యదర్శి పొట్లులూరు రవిచంద్ర, మమత, వైస్ ప్రెసిడెంట్లు ఎన్ ఎస్ రాఘవన్, అరుణ, ఎస్ మణి, పముజుల అమృతమ్మ, కార్యదర్శులు డీ అరవిందమ్మ, షేక్ అబ్దుల్ జబ్బర్, షేక్ జిలానీ, రెడ్డిపల్లి ప్రసాద్, చిర్రి గోపాల్, ట్రెజరర్ పట్టెం సురేష్, ఉచ్చురు హిందూ, సభ్యులు దామలచెరువు గిరిజేశ్వరి, షేక్ అక్బర్ భాషా, ఎస్ రమణ, దాసు గారి పార్వతీ, ఎన్ వెంకటేశన్, అత్తిరాల భాస్కర్, ఈశ్వరమ్మ, మోటుపాళ్యం శేఖర్, రాజేంద్ర, ఎ రవి, నీలవర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: శ్రీకాళహస్తి పట్టణంలో 13 రోజులు పాటు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రథోత్సవం రోజున సోమవారం నాడు సూపర్ స్నేహితుల మిత్రబృందం ఆధ్వర్యంలో భక్తులకు భారీ సంఖ్యలో అన్నప్రసాదాలు పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్బగా ఛైర్మెన్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి మాట్లాడుతూ… స్థానిక పానగల్ లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1982-83 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులందరు కలసి సూపర్ స్నేహితుల మిత్రబృందం అనే పేరిట ఒక గ్రూపుగా ఏర్పడి గత 16 ఏళ్ల నుంచి శ్రీకాళహస్తీశ్వరా స్వామీ-అమ్మవార్ల రథోత్సవం రోజున భక్తిశ్రద్ధలతో భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని నేడు సుమారుగా 2000 మందికి పైబడే రకరాల అన్న ప్రసాదాలు వితరణ చేశామన్నారు. తమ మిత్రబృందంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు, శుభకార్యక్రమాలు జరిగిన కలిసికట్టుగా ఉంటూ వారికి మేమున్నాం అంటూ భరోసాగా నిలబడుతున్నామని ప్రజలకు సేవ, సాయం చేయాలనే ఉద్దేశంతో తామంతా ఒక కమిటీగా ఏర్పడ్డామని అయన తెలిపారు. అన్నదాన సేవ అనంతరం అందరూ కలసి శ్రీ స్వామీ, అమ్మవార్ల దర్శనం చేసుకుని వేదపండితుల ఆశీర్వాదం పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ స్నేహితుల మిత్రబృందం ప్రెసిడెంట్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, ప్రధాన కార్యదర్శి పొట్లులూరు రవిచంద్ర, మమత, వైస్ ప్రెసిడెంట్లు ఎన్ ఎస్ రాఘవన్, అరుణ, ఎస్ మణి, పముజుల అమృతమ్మ, కార్యదర్శులు డీ అరవిందమ్మ, షేక్ అబ్దుల్ జబ్బర్, షేక్ జిలానీ, రెడ్డిపల్లి ప్రసాద్, చిర్రి గోపాల్, ట్రెజరర్ పట్టెం సురేష్, ఉచ్చురు హిందూ, సభ్యులు దామలచెరువు గిరిజేశ్వరి, షేక్ అక్బర్ భాషా, ఎస్ రమణ, దాసు గారి పార్వతీ, ఎన్ వెంకటేశన్, అత్తిరాల భాస్కర్, ఈశ్వరమ్మ, మోటుపాళ్యం శేఖర్, రాజేంద్ర, ఎ రవి, నీలవర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.