అమడగూరు: రాజకీయాలు వ్యక్తిగత స్థాయిలోకి దిగజార్చడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్య అని వైసిపి మండల కన్వీనర్ తనకంటి జయ్యప్ప అన్నారు.ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక శ్రీ చౌడేశ్వరి దేవి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కన్వీనర్ తనకంటి జయప్ప మాట్లాడుతూ….రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందించాలని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అధికార పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రతిపక్ష నాయకులు పైన వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని అన్నారు.ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయమని ప్రతిపక్ష నాయకులు ఎవరైనా అడిగితే వారిపై దాడి చేస్తూ,దుర్భాషలాడుతూ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం మంచిదికాదని తెలియజేశారు.ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని మానుకోవాలన్నారు.ప్రజలకు అందజేయాల్సిన సంక్షేమ పథకాలను అందించేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తనకంటి జయప్ప,స్టేట్ జాయింట్ సెక్రటరీ శేషురెడ్డి,శ్రీ సత్యసాయి డాక్టర్స్ వింగ్ డాక్టర్ రమేష్,సర్పంచ్ సురేంద్రరెడ్డి,మాజీ మండల కన్వీనర్ సూర్యనారాయణ,సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ తభిరీజ్,పంచాయతీ కన్వీనర్ కమ్మల నాగరాజు,టౌన్ కన్వీనర్ సుధాకర్ రాజు,రమణారెడ్డి,బావాజీ,కమ్మి రవి,చంద్ర,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సూపర్ సిక్స్ అమలు చేయండి. – వ్యక్తిగత విమర్శలు చేయకండి. – మండల కన్వీనర్ తనకంటి జయప్ప.
అమడగూరు: రాజకీయాలు వ్యక్తిగత స్థాయిలోకి దిగజార్చడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్య అని వైసిపి మండల కన్వీనర్ తనకంటి జయ్యప్ప అన్నారు.ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక శ్రీ చౌడేశ్వరి దేవి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కన్వీనర్ తనకంటి జయప్ప మాట్లాడుతూ….రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందించాలని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అధికార పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రతిపక్ష నాయకులు పైన వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని అన్నారు.ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయమని ప్రతిపక్ష నాయకులు ఎవరైనా అడిగితే వారిపై దాడి చేస్తూ,దుర్భాషలాడుతూ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం మంచిదికాదని తెలియజేశారు.ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని మానుకోవాలన్నారు.ప్రజలకు అందజేయాల్సిన సంక్షేమ పథకాలను అందించేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తనకంటి జయప్ప,స్టేట్ జాయింట్ సెక్రటరీ శేషురెడ్డి,శ్రీ సత్యసాయి డాక్టర్స్ వింగ్ డాక్టర్ రమేష్,సర్పంచ్ సురేంద్రరెడ్డి,మాజీ మండల కన్వీనర్ సూర్యనారాయణ,సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ తభిరీజ్,పంచాయతీ కన్వీనర్ కమ్మల నాగరాజు,టౌన్ కన్వీనర్ సుధాకర్ రాజు,రమణారెడ్డి,బావాజీ,కమ్మి రవి,చంద్ర,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

