Monday, 6 April 2026
  • Home  
  • సురవారిపల్లెలో కలెక్టర్‌తో కలిసి వంద రోజుల’ ప్రణాళికాకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- తిరుపతి

సురవారిపల్లెలో కలెక్టర్‌తో కలిసి వంద రోజుల’ ప్రణాళికాకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నియోజకవర్గ రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖ ద్వారా చేపట్టిన “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సోమవారం నాడు ఘనంగా ప్రారంభించారు. శ్రీకాళహస్తి మండలం సురవారిపల్లె గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో, ఇరిగేషన్ శాఖాధికారులతో కలిసి ఆయన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాష్ట్రస్థాయిలో ప్రారంభించిన ఈ కార్యక్రమం, నేటి నుండి జూలై 14, 2026 వరకు (100 రోజుల పాటు) నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ వంద రోజుల్లో నియోజకవర్గంలోని చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ మరియు భూగర్భ జల మట్టాలను పెంచడమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రణాళికలకే పరిమితం కాకుండా, ప్రతి గ్రామంలోనూ నీటి వనరులను కాపాడుకుంటూ సాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం. నియోజకవర్గాన్ని సుభిక్షం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం” అని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. రైతన్నలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గ రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖ ద్వారా చేపట్టిన “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సోమవారం నాడు ఘనంగా ప్రారంభించారు. శ్రీకాళహస్తి మండలం సురవారిపల్లె గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో, ఇరిగేషన్ శాఖాధికారులతో కలిసి ఆయన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాష్ట్రస్థాయిలో ప్రారంభించిన ఈ కార్యక్రమం, నేటి నుండి జూలై 14, 2026 వరకు (100 రోజుల పాటు) నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ వంద రోజుల్లో నియోజకవర్గంలోని చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ మరియు భూగర్భ జల మట్టాలను పెంచడమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రణాళికలకే పరిమితం కాకుండా, ప్రతి గ్రామంలోనూ నీటి వనరులను కాపాడుకుంటూ సాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం. నియోజకవర్గాన్ని సుభిక్షం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం” అని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. రైతన్నలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.