*సింహగిరిపై ఇండియన్ క్రికెటర్ సందడి*
*స్వామివారిని దర్శించు కున్న శ్రీ చరణి*
*విశాఖపట్నండిసెంబర్ 20పున్నమి ప్రతినిధి*
భారత యువ క్రికెటర్ శ్రీచరణి శనివారం సింహాచల క్షేత్రాన్ని సందర్శించారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆయన దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయానికి చేరుకున్న క్రికెటర్ శ్రీచరణికి ఆలయ సహాయ కార్యనిర్వహణా ధికారి కె.తిరుమలేశ్వరరావు సాదరంగా స్వాగతం పలికారు ఆలయ సంప్ర దాయాలను అనుసరిస్తూ, శ్రీ శ్రీచరణి ముందుగా భక్తుల నమ్మకమైన ‘కప్పస్తంభాన్ని’ ఆలింగనం చేసుకున్నారు.
అనంతరం గర్భాలయంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి విశిష్టతను ఆయనకు వివరించారు దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఆయనకు వేద మంత్రోచ్ఛారణలతో ‘వేద ఆశీర్వచనం’ అందజేశారు ఈ సందర్భంగా ఏఈఓ కె. తిరు మలేశ్వరరావు శ్రీచరణికి స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి, ఆలయ ప్రసాదాలను అందజేశారు భారత జట్టులో రాణించి దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ఆలయ పండితులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.


