Friday, 3 April 2026
  • Home  
  • సర్పంచులకు ఘన సన్మానం – తొట్టంబేడు మండలంలో జోరుగా అభినందన సభ
- తిరుపతి

సర్పంచులకు ఘన సన్మానం – తొట్టంబేడు మండలంలో జోరుగా అభినందన సభ

తొట్టంబేడు, ఏప్రిల్ 03 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని తొట్టంబేడు మండల సర్పంచుల పదవీకాలం ముగిసిన సందర్భంగా వారి సేవలను కొనియాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ‘సర్పంచుల అభినందన సభ’ నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి వారు చేసిన కృషిని ప్రశంసిస్తూ సభలో ప్రత్యేకంగా సత్కరించారు. సభలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఐదేళ్ల కాలంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో వారి సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఆనంతరం సర్పంచులు మాట్లాడుతూ….తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించి, గ్రామాభివృద్ధికి మార్గనిర్దేశం చేసిన మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. తమకు సర్పంచులుగా సేవ చేసే అవకాశం కల్పించి, ఎల్లప్పుడూ అండగా నిలిచిన నాయకుడిగా ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామని సర్పంచులు భావోద్వేగంతో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులు, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తొట్టంబేడు, ఏప్రిల్ 03 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని తొట్టంబేడు మండల సర్పంచుల పదవీకాలం ముగిసిన సందర్భంగా వారి సేవలను కొనియాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ‘సర్పంచుల అభినందన సభ’ నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి వారు చేసిన కృషిని ప్రశంసిస్తూ సభలో ప్రత్యేకంగా సత్కరించారు. సభలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఐదేళ్ల కాలంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో వారి సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఆనంతరం సర్పంచులు మాట్లాడుతూ….తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించి, గ్రామాభివృద్ధికి మార్గనిర్దేశం చేసిన మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. తమకు సర్పంచులుగా సేవ చేసే అవకాశం కల్పించి, ఎల్లప్పుడూ అండగా నిలిచిన నాయకుడిగా ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామని సర్పంచులు భావోద్వేగంతో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులు, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.