శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: మండల కేంద్రంలోని స్థానిక ఐ.సి.డి.ఎస్ కార్యాలయం ఎదుట సోమవారం ప్రజా సంఘాలైన సి.ఐ.టి.యు, ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు నాయకులు పెనగడం గురవయ్య మాట్లాడుతూ.. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పోషక ఆహారం, శిశువుల ఆరోగ్యం, పిల్లల పోషణ స్థాయిని పెంచి పిల్లల శారీరక మానసిక పెరుగుదలకు బాటలు వేసే అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీలు వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ 42 రోజులు దీక్షలు నిర్వహించిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వారి దీక్ష శిబిరాల వద్దకు వచ్చి మా పార్టీ అధికారంలోకి రాగానే నీ న్యాయమైన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని తెలిపారని ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు కాలం గడిచినప్పటికీ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోవడం ఎంతో దుర్మార్గమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కింద ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తకు 26 వేల రూపాయల జీతం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేశారు. ఈనెల 25, 26, 27వ తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట రిలే దీక్షలు గురవయ్య పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు నాయకులు గంధం మణి, రాజా, రేవతి, పుష్ప, సక్కుబాయి, ఐ. ఎఫ్.టి.యు నాయకులు జాకీర్, కల్పన తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారం కోసం దీక్షలుచేపట్టిన దు అంగన్వాడీ కార్యకర్తలు
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: మండల కేంద్రంలోని స్థానిక ఐ.సి.డి.ఎస్ కార్యాలయం ఎదుట సోమవారం ప్రజా సంఘాలైన సి.ఐ.టి.యు, ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు నాయకులు పెనగడం గురవయ్య మాట్లాడుతూ.. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పోషక ఆహారం, శిశువుల ఆరోగ్యం, పిల్లల పోషణ స్థాయిని పెంచి పిల్లల శారీరక మానసిక పెరుగుదలకు బాటలు వేసే అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీలు వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ 42 రోజులు దీక్షలు నిర్వహించిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వారి దీక్ష శిబిరాల వద్దకు వచ్చి మా పార్టీ అధికారంలోకి రాగానే నీ న్యాయమైన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని తెలిపారని ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు కాలం గడిచినప్పటికీ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోవడం ఎంతో దుర్మార్గమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కింద ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తకు 26 వేల రూపాయల జీతం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేశారు. ఈనెల 25, 26, 27వ తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట రిలే దీక్షలు గురవయ్య పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు నాయకులు గంధం మణి, రాజా, రేవతి, పుష్ప, సక్కుబాయి, ఐ. ఎఫ్.టి.యు నాయకులు జాకీర్, కల్పన తదితరులు పాల్గొన్నారు.

