సంగం మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ముఖ్య సమావేశం జరగనుంది. పాత బ్యారేజి ఇరిగేషన్ ఏఈ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ రైతులతో సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతలపై చర్చించనున్నారు. చెరువులు, కాలువల పునరుద్ధరణతో పాటు పూడికతీత పనులను ప్రారంభించనున్నారు. ఈ సమావేశానికి సాగునీటి సంఘాల ప్రతినిధులు, రైతు నాయకులు, కూటమి పార్టీల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని టిడిపి నాయకులు కోరారు.

సంగంలో సాగునీటి భద్రతపై రైతులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశం
సంగం మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ముఖ్య సమావేశం జరగనుంది. పాత బ్యారేజి ఇరిగేషన్ ఏఈ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ రైతులతో సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతలపై చర్చించనున్నారు. చెరువులు, కాలువల పునరుద్ధరణతో పాటు పూడికతీత పనులను ప్రారంభించనున్నారు. ఈ సమావేశానికి సాగునీటి సంఘాల ప్రతినిధులు, రైతు నాయకులు, కూటమి పార్టీల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని టిడిపి నాయకులు కోరారు.

