శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదల అనూహ్యంగా కొనసాగుతోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ నేతృత్వంలో నియోజకవర్గంలో పార్టీ కేడర్ ఉత్సాహంగా పని చేస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వాల సంఖ్య 10,000 మార్కును దాటడం ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. గత ఏడాది 7,388 సభ్యత్వాలు నమోదు కాగా, ఈ సంవత్సరం ఆ సంఖ్యను అధిగమించి ఇప్పటికే 10 వేల మార్కును చేరుకుంది. ఇదే ఉత్సాహంతో 15,000 సభ్యత్వాల లక్ష్యం దిశగా నియోజకవర్గ జనసైనికులు దూసుకుపోతున్నారు. ఈ అద్భుత విజయానికి కారకులైన శ్రీకాళహస్తి నియోజకవర్గ సాధకులకు, కార్యకర్తలకు కొట్టే సాయి ప్రసాద్ తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా క్షేత్రంలో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న సాయి ప్రసాద్ కృషిని కార్యకర్తలు కొనియాడారు. ఇదే పంథాలో ముందుకు సాగి నియోజకవర్గంలో జనసేన జెండాను మరింత ఎత్తులో ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

శ్రీకాళహస్తిలో జనసేన జోరు-10 వేల మార్కును దాటిన క్రియాశీలక సభ్యత్వాలు
శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదల అనూహ్యంగా కొనసాగుతోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ నేతృత్వంలో నియోజకవర్గంలో పార్టీ కేడర్ ఉత్సాహంగా పని చేస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వాల సంఖ్య 10,000 మార్కును దాటడం ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. గత ఏడాది 7,388 సభ్యత్వాలు నమోదు కాగా, ఈ సంవత్సరం ఆ సంఖ్యను అధిగమించి ఇప్పటికే 10 వేల మార్కును చేరుకుంది. ఇదే ఉత్సాహంతో 15,000 సభ్యత్వాల లక్ష్యం దిశగా నియోజకవర్గ జనసైనికులు దూసుకుపోతున్నారు. ఈ అద్భుత విజయానికి కారకులైన శ్రీకాళహస్తి నియోజకవర్గ సాధకులకు, కార్యకర్తలకు కొట్టే సాయి ప్రసాద్ తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా క్షేత్రంలో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న సాయి ప్రసాద్ కృషిని కార్యకర్తలు కొనియాడారు. ఇదే పంథాలో ముందుకు సాగి నియోజకవర్గంలో జనసేన జెండాను మరింత ఎత్తులో ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

