శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దక్షిణ ఆమ్నాయ శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి పూజ్యశ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామి వారు క్షేత్ర పర్యటనలో భాగంగా బుధవారం నాడు శ్రీకాళహస్తికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జగద్గురువులకు ఆలయ మర్యాదలతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పూజ్య స్వామీజీతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, మంత్రి ఆనం తదితరులు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జగద్గురువులతో కలిసి పరమేశ్వరుడిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. స్వామీజీ పాదస్పర్శతో ఈ క్షేత్రం మరింత పునీతమైందని, వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దర్శనానంతరం శృంగేరి పీఠం ఉత్తరాధికారి విదుశేఖర భారతీ తీర్థ స్వామి వారి నుంచి ఎమ్మెల్యే, మంత్రి, ఇతర ప్రముఖులు ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆ పరమశివుడి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని మనసారా వేడుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు, ఆర్డిఓ భాను ప్రకాష్, భాజపా నాయకులు కోలా ఆనంద్, ఆలయ పాలకమండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, బోర్డు సభ్యులు, కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగద్గురువుల రాకను పురస్కరించుకుని ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

శ్రీకాళహస్తిలో ఆధ్యాత్మిక పరవశం-శృంగేరి జగద్గురువులకు ఘనస్వాగతం
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దక్షిణ ఆమ్నాయ శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి పూజ్యశ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామి వారు క్షేత్ర పర్యటనలో భాగంగా బుధవారం నాడు శ్రీకాళహస్తికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జగద్గురువులకు ఆలయ మర్యాదలతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పూజ్య స్వామీజీతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, మంత్రి ఆనం తదితరులు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జగద్గురువులతో కలిసి పరమేశ్వరుడిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. స్వామీజీ పాదస్పర్శతో ఈ క్షేత్రం మరింత పునీతమైందని, వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దర్శనానంతరం శృంగేరి పీఠం ఉత్తరాధికారి విదుశేఖర భారతీ తీర్థ స్వామి వారి నుంచి ఎమ్మెల్యే, మంత్రి, ఇతర ప్రముఖులు ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆ పరమశివుడి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని మనసారా వేడుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు, ఆర్డిఓ భాను ప్రకాష్, భాజపా నాయకులు కోలా ఆనంద్, ఆలయ పాలకమండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, బోర్డు సభ్యులు, కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగద్గురువుల రాకను పురస్కరించుకుని ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

