*శ్రీకాళహస్తి బీసీ హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆగ్రహం*
శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలుర బీసీ హాస్టల్లో కలుషిత ఆహారం కారణంగా పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో సుమారు 16 మంది విద్యార్థులు అనారోగ్యానికి లోనై శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కి తరలించబడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే డిల్లీలో ఉన్న ఎంపీ గురుమూర్తి చరవాణి ద్వారా స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. అనంతరం జిల్లా బీసి సంక్షేమ శాఖ అధికారితో మాట్లాడిన ఎంపీ విద్యార్దులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ ఘటనకు దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలకు అందించే ఆహారం విషయంలో నిర్లక్ష్య ధోరణి సహించారనిదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలసిన భాద్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ వసతి గృహాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

