శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ఈ వేడుకలలో పాల్గొని మహిళా నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా బృందమ్మ మాట్లాడుతూ…..తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ వంటి పథకాల ద్వారా మహిళల ఆర్థిక భారం తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సమాజంలో మహిళలు మరింత ముందుకు రావడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఉన్న గౌరవం ఎంతో గొప్పదని బొజ్జల బృందమ్మ మహిళలకు రాజకీయంగా కూడా అవకాశాలు కల్పిస్తూ నాయకత్వ స్థానాలకు తీసుకువెళ్లే పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలుస్తోందని, మహిళా శక్తి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులతో పాటు కూటమి ప్రభుత్వం నాయకులు కూడా పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి తెదేపా కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ఈ వేడుకలలో పాల్గొని మహిళా నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా బృందమ్మ మాట్లాడుతూ…..తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ వంటి పథకాల ద్వారా మహిళల ఆర్థిక భారం తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సమాజంలో మహిళలు మరింత ముందుకు రావడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఉన్న గౌరవం ఎంతో గొప్పదని బొజ్జల బృందమ్మ మహిళలకు రాజకీయంగా కూడా అవకాశాలు కల్పిస్తూ నాయకత్వ స్థానాలకు తీసుకువెళ్లే పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలుస్తోందని, మహిళా శక్తి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులతో పాటు కూటమి ప్రభుత్వం నాయకులు కూడా పాల్గొన్నారు.

