శ్రీ కాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 21: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో తన నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించగా ఇరువురు అభివృద్ధి పనులపై కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ప్రధాన ఆలయ అభివృద్ధికి చేపడుతున్న మాస్టర్ ప్లాన్ పనులను మంత్రికి వివరించారు. ముఖ్యంగా, ప్రపంచంలోనే అత్యంత పురాతన శివలింగం ఉన్న గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయ విశిష్టతను, అక్కడ జరుగుతున్న పునరుద్ధరణ పనులను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ….ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీకాళహస్తి, చారిత్రక గుడిమల్లం ఆలయాలను దేశవ్యాప్తంగా అగ్రగామి పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విన్నవించినట్లుగా శ్రీకాళహస్తి కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, మన సంస్కృతికి నిలువుటద్దమని గుడిమల్లం, శ్రీకాళహస్తి ఆలయాలకు కేంద్ర పర్యాటక శాఖ నుండి మరిన్ని నిధులు, గుర్తింపు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెంచేలా విమానయాన అనుసంధానతపై కూడా దృష్టి సారిస్తామని మంత్రి హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో బొజ్జల కుటుంబ సభ్యులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు, ముఖ్య అనుచరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి, గుడిమల్లం ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తాం-కేంద్ర మంత్రి
శ్రీ కాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 21: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో తన నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించగా ఇరువురు అభివృద్ధి పనులపై కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ప్రధాన ఆలయ అభివృద్ధికి చేపడుతున్న మాస్టర్ ప్లాన్ పనులను మంత్రికి వివరించారు. ముఖ్యంగా, ప్రపంచంలోనే అత్యంత పురాతన శివలింగం ఉన్న గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయ విశిష్టతను, అక్కడ జరుగుతున్న పునరుద్ధరణ పనులను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ….ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీకాళహస్తి, చారిత్రక గుడిమల్లం ఆలయాలను దేశవ్యాప్తంగా అగ్రగామి పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విన్నవించినట్లుగా శ్రీకాళహస్తి కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, మన సంస్కృతికి నిలువుటద్దమని గుడిమల్లం, శ్రీకాళహస్తి ఆలయాలకు కేంద్ర పర్యాటక శాఖ నుండి మరిన్ని నిధులు, గుర్తింపు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెంచేలా విమానయాన అనుసంధానతపై కూడా దృష్టి సారిస్తామని మంత్రి హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో బొజ్జల కుటుంబ సభ్యులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు, ముఖ్య అనుచరులు పాల్గొన్నారు.

