*శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మొదటి గురువారం పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *
* వైభవంగా ప్రారంభమైన మొదటి గురువారం పూజా కార్యక్రమం
* అమ్మవారి గర్భాలయంలో పంచామృతాలతో మొదటి గురువారం పూజ ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు
* పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ఈవో, ఉత్సవ కమిటీ సభ్యులు
ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో తొలి గురువారం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పద్మజా దంపతులు పంచామృత అభిషేకాలతో పూజలు ప్రారంభించారు. ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి మరియు ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజ అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న మండపంలో ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదములు అందజేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారని మొదటి గురువారం అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ముందు జాగ్రత్తతో అధికసిబ్బంది తో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేసామని తెలిపారు . కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక కార్పొరేటర్ , కూటమి నేతలు, పోలీసు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు..


