రైల్వే కోడూరు మండలం ఉర్లగట్టుపోడు పంచాయితీ పరిధిలోని బాలిరెడ్డిపల్లె గ్రామంలో వెలసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం 15వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆమె ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తమ కుటుంబం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి 15వ వార్షికోత్సవంలో ముక్కా వరలక్ష్మి పాల్గొన్నారు
రైల్వే కోడూరు మండలం ఉర్లగట్టుపోడు పంచాయితీ పరిధిలోని బాలిరెడ్డిపల్లె గ్రామంలో వెలసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం 15వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆమె ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తమ కుటుంబం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

