శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా పూజ్యశ్రీ శృంగేరి జగద్గురువులు బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వగ్రామమైన ఊరందూరును సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎమ్మెల్యే నూతన నివాసానికి జగద్గురువులు విచ్చేసి తమ పాదస్పర్శతో ఆ గృహాన్ని పవిత్రం చేశారు. జగద్గురువుల రాకతో ఎమ్మెల్యే గృహం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు జగద్గురువుల ఆశీస్సులు పొందే భాగ్యం పొందారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి జగద్గురువులకు ఘన స్వాగతం పలికి, భక్తిశ్రద్ధలతో ఆతిథ్యం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…శాంతి, ధర్మానికి ప్రతిరూపమైన శృంగేరి జగద్గురువులు తమ నివాసానికి విచ్చేసి పాదస్పర్శ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తమ కుటుంబ సభ్యులు, బంధువులను ఆశీర్వదించడం జీవితంలో మరచిపోలేని అనుభూతిగా భావిస్తున్నానని పేర్కొన్నారు. జగద్గురువుల ఆశీస్సులతో తమ గృహం ఆధ్యాత్మిక కాంతితో వెలిగిపోయిందని, వారి దివ్య కరుణ తమ కుటుంబంతో పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పుణ్యసందర్భం తమకు ఎంతో ప్రత్యేకమైందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. జగద్గురువుల సందర్శనతో ఊరందూరు గ్రామంలో భక్తి, ఆధ్యాత్మికత నిండిన వాతావరణం నెలకొంది. గ్రామస్థులు కూడా ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జగద్గురువుల ఆశీస్సులు పొందారు.

శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో కాంతివంతమైన ఎమ్మెల్యే గృహం
శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా పూజ్యశ్రీ శృంగేరి జగద్గురువులు బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వగ్రామమైన ఊరందూరును సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎమ్మెల్యే నూతన నివాసానికి జగద్గురువులు విచ్చేసి తమ పాదస్పర్శతో ఆ గృహాన్ని పవిత్రం చేశారు. జగద్గురువుల రాకతో ఎమ్మెల్యే గృహం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు జగద్గురువుల ఆశీస్సులు పొందే భాగ్యం పొందారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి జగద్గురువులకు ఘన స్వాగతం పలికి, భక్తిశ్రద్ధలతో ఆతిథ్యం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…శాంతి, ధర్మానికి ప్రతిరూపమైన శృంగేరి జగద్గురువులు తమ నివాసానికి విచ్చేసి పాదస్పర్శ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తమ కుటుంబ సభ్యులు, బంధువులను ఆశీర్వదించడం జీవితంలో మరచిపోలేని అనుభూతిగా భావిస్తున్నానని పేర్కొన్నారు. జగద్గురువుల ఆశీస్సులతో తమ గృహం ఆధ్యాత్మిక కాంతితో వెలిగిపోయిందని, వారి దివ్య కరుణ తమ కుటుంబంతో పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పుణ్యసందర్భం తమకు ఎంతో ప్రత్యేకమైందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. జగద్గురువుల సందర్శనతో ఊరందూరు గ్రామంలో భక్తి, ఆధ్యాత్మికత నిండిన వాతావరణం నెలకొంది. గ్రామస్థులు కూడా ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జగద్గురువుల ఆశీస్సులు పొందారు.

