శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 21: శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శనివారం నాడు సందర్శించి శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషిత రెడ్డి , ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికి ప్రత్యెక దర్శన ఏర్పాట్లు చేయించి అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను, శేషవస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. శ్రీకాళహస్తి క్షేత్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా విమాన సర్వీసుల కనెక్టివిటీని పెంచుతామని హామీ ఇచ్చారు.

శివయ్యసన్నిధిలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 21: శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శనివారం నాడు సందర్శించి శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషిత రెడ్డి , ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికి ప్రత్యెక దర్శన ఏర్పాట్లు చేయించి అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను, శేషవస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. శ్రీకాళహస్తి క్షేత్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా విమాన సర్వీసుల కనెక్టివిటీని పెంచుతామని హామీ ఇచ్చారు.

