Saturday, 21 February 2026
  • Home  
  • వైభవంగా పల్లకి సేవ..పురవీధుల్లో విహరించిన ఆది దంపతులు
- తిరుపతి

వైభవంగా పల్లకి సేవ..పురవీధుల్లో విహరించిన ఆది దంపతులు

శ్రీ కాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 21: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహో్మూ వాత్సవాలలో భాగంగా శనివారం రాత్రి పల్లకి సేవ వైభవంగా జరిగింది. మానవులకే కాకుండా దేవతల సైతం స వతి పోరు తలనొప్పులు పుట్టించినట్టు పురాణాలలో వుంది. మహాశివరాత్రి బ్రహ్మోవాత్సవాలలో అత్యంత ప్రత్యేకమై నది పల్లకి సేవ పార్వతి దేవి ఎంతో ఇష్టపడి మనువాడుతుంది. పరమశివుడు మాత్రం గంగాదేవిని వదలక నెత్తిన జ టాజుటంలో పెట్టుకుంటాడు అంతేకాకుండా ఉత్సవాల సమయంలో ప్రత్యేక స్థానాన్ని గంగాదేవికి కల్పిస్తాడు వివాహ అనంతరం పరమేశ్వరుడు గంగాదేవితోనే ఊరేగడం జ్ఞానప్రసునాంబిక దేవికి విపరీతమైన కోపాన్ని కలిగిస్తుంది. దీని తో స్వామి కోసం ఎదురు చూడకుండా కోపంతో ముందుగానే పల్లకీలో వెళ్లిపోతుంది. ఆమె కోపాన్ని తగ్గించాడానికి స్వామి అమ్మవారి వెనుకగా పరుగులు తీస్తారు. ఈ నయానాందకర దృశ్యం శనివారం రాత్రి జరిగింది, “ప్రతి ఉ’ త్సవాలలో స్వామి వాహనానికి వెనుక ప్రక్కన అమ్మవారు వస్తారు. ఐతే పల్లకి సేవ రోజు మాత్రం అమ్మవారి వాహనం ముందుగా వెళుతుంది. ఆగ్రహంతో వున్నట్లు అమ్మవారిని పూజరులు అలంకరిస్తారు. భక్తులు నేరుగా అమ్మవారిని చూడటం అంత శ్రేయేస్కరం కాదని అమ్మవారిముందర దర్పణం (అద్దం) అమర్చుతారు. భక్తులు అమ్మవారిని దర్ప ణ దర్శినం చేసుకుని తరించారు. ఉత్సవాల్లో భాగంగా చివరగా జరిగే ఏకాంత సేవతో ఈ వేడుకలు ముగియనున్నాయి. భక్తులు తమ ఇంటి ముంగిట స్వామివారికి హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సేవలో దేవస్థాన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

శ్రీ కాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 21: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహో్మూ వాత్సవాలలో భాగంగా శనివారం రాత్రి పల్లకి సేవ వైభవంగా జరిగింది. మానవులకే కాకుండా దేవతల సైతం స వతి పోరు తలనొప్పులు పుట్టించినట్టు పురాణాలలో వుంది. మహాశివరాత్రి బ్రహ్మోవాత్సవాలలో అత్యంత ప్రత్యేకమై నది పల్లకి సేవ పార్వతి దేవి ఎంతో ఇష్టపడి మనువాడుతుంది. పరమశివుడు మాత్రం గంగాదేవిని వదలక నెత్తిన జ టాజుటంలో పెట్టుకుంటాడు అంతేకాకుండా ఉత్సవాల సమయంలో ప్రత్యేక స్థానాన్ని గంగాదేవికి కల్పిస్తాడు వివాహ అనంతరం పరమేశ్వరుడు గంగాదేవితోనే ఊరేగడం జ్ఞానప్రసునాంబిక దేవికి విపరీతమైన కోపాన్ని కలిగిస్తుంది. దీని తో స్వామి కోసం ఎదురు చూడకుండా కోపంతో ముందుగానే పల్లకీలో వెళ్లిపోతుంది. ఆమె కోపాన్ని తగ్గించాడానికి స్వామి అమ్మవారి వెనుకగా పరుగులు తీస్తారు. ఈ నయానాందకర దృశ్యం శనివారం రాత్రి జరిగింది, “ప్రతి ఉ’ త్సవాలలో స్వామి వాహనానికి వెనుక ప్రక్కన అమ్మవారు వస్తారు. ఐతే పల్లకి సేవ రోజు మాత్రం అమ్మవారి వాహనం ముందుగా వెళుతుంది. ఆగ్రహంతో వున్నట్లు అమ్మవారిని పూజరులు అలంకరిస్తారు. భక్తులు నేరుగా అమ్మవారిని చూడటం అంత శ్రేయేస్కరం కాదని అమ్మవారిముందర దర్పణం (అద్దం) అమర్చుతారు. భక్తులు అమ్మవారిని దర్ప ణ దర్శినం చేసుకుని తరించారు. ఉత్సవాల్లో భాగంగా చివరగా జరిగే ఏకాంత సేవతో ఈ వేడుకలు ముగియనున్నాయి. భక్తులు తమ ఇంటి ముంగిట స్వామివారికి హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సేవలో దేవస్థాన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.