*వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి గారు…*
*నూజివీడు పట్టణం, 16వ వార్డుకు చెందిన పులిచెర్ల శారద గారికి వైద్య చికిత్స నిమిత్తం ₹50,000/- ఎల్ఓసి చెక్కు, అలాగే ముసునూరు మండలం, చెక్కపల్లి గ్రామానికి చెందిన షేక్ అక్తరునిస్సా గారికి వైద్య ఖర్చుల భారం తగ్గించే ఉద్దేశ్యంతో ₹2,00,000/- ఎల్ఓసి చెక్కును రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి గారు స్వయంగా అందజేశారు.*
*ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ –*
*“ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నాను. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య సహాయం అందించటం కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యత. ప్రతి ఒక్కరి ప్రాణం మాకు విలువైనదే. పేదలకు, బలహీన వర్గాలకు వైద్యరంగంలో ఎప్పటికప్పుడు అండగా నిలుస్తాం” అని హామీ ఇచ్చారు.*
*లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ఆర్థిక సహాయం తమకు ఎంతో ఉపయుక్తమవుతుందని భావోద్వేగంతో తెలిపారు.*


