Sunday, 22 March 2026
  • Home  
  • వేడాం మార్గ మద్యంలో వరి నాట్లు నాటి నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు
- తిరుపతి

వేడాం మార్గ మద్యంలో వరి నాట్లు నాటి నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 20, శ్రీకాళహస్తి మండలం, వేడాం మార్గంలో వ్యవసాయ తూములను ఆక్రమించినందువల్ల మార్గం గుండా వాహనాలు కూడా పోలేని విధంగా రోడ్డు దెబ్బతిన్నందువల్ల, ఆ మార్గం పూర్తిగా జలమయమై రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో రోడ్డు నందు వరి నాట్లు నాటి, చేపలు పట్టిన కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా DCC అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ…ఈ మార్గం గుండా నిత్యం వేలాదిమంది జీవనోపాధి కొరకు, అత్యవసర సమయాల్లో ఈ రోడ్డు నందు ప్రయాణం చేస్తూ ఉంటారని, పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ రహదారినీ పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా తయారయిందన్నారు. అనంతరం తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ వేడాం రోడ్డు మార్గం నిత్యం శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులు వెయ్యలింగాలకోన, భైరవకోన, దక్షిణ కాళికాదేవి ఆలయాల సందర్శన నిమిత్తం వేలాదిమంది ప్రయాణం చేస్తున్నటువంటి ఈ మార్గం బాగు చేయడం అత్యవసరమని అదే విధంగా ఈ మార్గం గుండా ప్రయాణం నరకప్రాయంగా, ప్రమాదాలకు నిలయంగా మారిందని, ఈ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్ రాయల్, శ్రీకాళహస్తి మండలం యువజన అధ్యక్షులు నవీన్, రేణిగుంట మండల యువజన అధ్యక్షులు ఆసిఫ్, కళ్యాణ్, నాగరాజు, అల్లావుద్దీన్, చరణ్, మహాలక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 20, శ్రీకాళహస్తి మండలం, వేడాం మార్గంలో వ్యవసాయ తూములను ఆక్రమించినందువల్ల మార్గం గుండా వాహనాలు కూడా పోలేని విధంగా రోడ్డు దెబ్బతిన్నందువల్ల, ఆ మార్గం పూర్తిగా జలమయమై రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో రోడ్డు నందు వరి నాట్లు నాటి, చేపలు పట్టిన కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా DCC అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ…ఈ మార్గం గుండా నిత్యం వేలాదిమంది జీవనోపాధి కొరకు, అత్యవసర సమయాల్లో ఈ రోడ్డు నందు ప్రయాణం చేస్తూ ఉంటారని, పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ రహదారినీ పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా తయారయిందన్నారు. అనంతరం తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ వేడాం రోడ్డు మార్గం నిత్యం శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులు వెయ్యలింగాలకోన, భైరవకోన, దక్షిణ కాళికాదేవి ఆలయాల సందర్శన నిమిత్తం వేలాదిమంది ప్రయాణం చేస్తున్నటువంటి ఈ మార్గం బాగు చేయడం అత్యవసరమని అదే విధంగా ఈ మార్గం గుండా ప్రయాణం నరకప్రాయంగా, ప్రమాదాలకు నిలయంగా మారిందని, ఈ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్ రాయల్, శ్రీకాళహస్తి మండలం యువజన అధ్యక్షులు నవీన్, రేణిగుంట మండల యువజన అధ్యక్షులు ఆసిఫ్, కళ్యాణ్, నాగరాజు, అల్లావుద్దీన్, చరణ్, మహాలక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.