పాడేరు, అక్టోబర్ 3 :
సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (PGRS) కు మొత్తం 67 వినతులు స్వీకరించబడ్డాయి. జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ కె. సాహిత్, డిఆర్ఓ కె. పద్మలతలు అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీదారులు మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలు, Meekosam.ap.gov.in వెబ్సైట్ను వినియోగించుకోవాలని సూచించారు.
స్వీకరించిన కొన్ని వినతులు:
హుకుంపేట మండలం మత్స్యపురం గ్రామానికి సి.సి రోడ్డు మంజూరు.
ముంచింగిపుట్టు ఏనుగురాయి గ్రామంలో శిధిలావస్థలో ఉన్న అంగన్వాడీ భవనానికి బదులుగా కొత్త భవనం నిర్మాణం.
కొయ్యూరు మండలం రామ్నగర్లో త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు.
దుంబ్రిగుడ మండలం వయ్య సిరసగుడ–చిమిలిగుడ మధ్య తారు రోడ్డు నిర్మాణం.
పెదగుడ గ్రామంలో సికిల్ సెల్ అనేమియా బాధితునికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఖాతాలో జమ చేయడం.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, గిరిజన సంక్షేమ విభాగ అధికారులు, పలు శాఖాధికారులు పాల్గొన్నారు.


