ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) .మనుబోలు మండలం బండేపల్లి గ్రామానికి చెందిన రైతు ఆవుల చిన్న పోతయ్య (45) విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. వరి కోతల సమయం ప్రారంభం కావడంతో పశువులకు గడ్డి తీసుకువస్తుండగా హఠాత్తుగా కరెంట్ స్తంభం వాలింది. దానికి ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో పోతయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బోరున విలపిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు ఎస్సై శివ రాకేష్ తెలిపారు.

విద్యుత్ షాక్తో రైతు మృతి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) .మనుబోలు మండలం బండేపల్లి గ్రామానికి చెందిన రైతు ఆవుల చిన్న పోతయ్య (45) విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. వరి కోతల సమయం ప్రారంభం కావడంతో పశువులకు గడ్డి తీసుకువస్తుండగా హఠాత్తుగా కరెంట్ స్తంభం వాలింది. దానికి ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో పోతయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బోరున విలపిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు ఎస్సై శివ రాకేష్ తెలిపారు.

