పున్నమి ప్రతినిధి – నెల్లూరు
పొదలకూరు రోడ్డులోని వెల్ వాకర్స్ వింగ్ ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో జాతీయ నాయకులు డా. బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ ఫోటోలను బహూకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బొగ్గవరపు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకుని పెద్దలు సూచించిన మంచి విలువలను అనుసరిస్తే భవిష్యత్తు उज్వలంగా ఉంటుందన్నారు. ఈ ఏడాది విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ డా. గంగిశెట్టి శివకుమార్, రచయిత డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య, కోశాధికారి పెంచల నరసింహారావు, కళ్యాణి, రాధా పాల్గొన్నారు


