ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు ప్రాంతంలోని శ్రీ విద్యానికేతన్ కోచింగ్ సెంటర్లో బుధవారం సరస్వతి పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ కామాక్షితాయి బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సాయి కుమార్ శర్మ కలశ ప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులకు ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి కావేటి భార్గవ్ పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు. చింటూ ధ్యాన స్మృతి వనం వ్యవస్థాపకులు వల్లం రమేష్ పెన్నులు, పెన్సిల్లు, మిఠాయిలను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ కరస్పాండెంట్ జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యాభివృద్ధి కోసం సరస్వతి పూజ నిర్వహించిన విద్యానికేతన్
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి ( పున్నమి ప్రతినిధి) మనుబోలు ప్రాంతంలోని శ్రీ విద్యానికేతన్ కోచింగ్ సెంటర్లో బుధవారం సరస్వతి పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ కామాక్షితాయి బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సాయి కుమార్ శర్మ కలశ ప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులకు ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి కావేటి భార్గవ్ పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు. చింటూ ధ్యాన స్మృతి వనం వ్యవస్థాపకులు వల్లం రమేష్ పెన్నులు, పెన్సిల్లు, మిఠాయిలను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ కరస్పాండెంట్ జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

