నేడు సోమవారం చిన్న అన్నలూరు ఎస్సీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. వడదెబ్బ కారణంగా అజ్జిగంటి బుజ్జమ్మ (75) మృతి చెందారు. ఈ ఘటనపై బీఎస్పీ పార్టీ రాష్ట్ర మహిళా కన్వినర్ క్రాకుటూరు పుష్పాంజలి స్పందించి, స్వయంగా అక్కడికి చేరుకుని బుజ్జమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ప్రజలు వేసవిలో జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికులు కూడా బుజ్జమ్మ మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

వడదెబ్బతో వృద్ధ మహిళ మృతి.. బీఎస్పీ నేత పుష్పాంజలి నివాళి
నేడు సోమవారం చిన్న అన్నలూరు ఎస్సీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. వడదెబ్బ కారణంగా అజ్జిగంటి బుజ్జమ్మ (75) మృతి చెందారు. ఈ ఘటనపై బీఎస్పీ పార్టీ రాష్ట్ర మహిళా కన్వినర్ క్రాకుటూరు పుష్పాంజలి స్పందించి, స్వయంగా అక్కడికి చేరుకుని బుజ్జమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ప్రజలు వేసవిలో జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికులు కూడా బుజ్జమ్మ మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

