శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 07: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన పోలీసు అధికారుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ… మార్చి 14న జరిగే జాతీయ లోక్ అదాలత్లో కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ధనం ఆదా అవుతాయని తెలిపారు. లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు అవుతుందని, దానికి అప్పీల్ చేసే అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్లో వివిధ రకాల సివిల్ కేసులతో పాటు రాజీకి లోబడే క్రిమినల్ కేసులను కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే కోర్టులో పెండింగ్లో లేని ప్రీ-లిటిగేషన్ కేసులను కూడా రాజీ ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పోలీసులు, న్యాయవాదులు కలిసి ఎక్కువ సంఖ్యలో కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం అయ్యేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి, జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ, శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, అలాగే శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు అవుతుంది- న్యాయమూర్తి
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 07: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన పోలీసు అధికారుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ… మార్చి 14న జరిగే జాతీయ లోక్ అదాలత్లో కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ధనం ఆదా అవుతాయని తెలిపారు. లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు అవుతుందని, దానికి అప్పీల్ చేసే అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్లో వివిధ రకాల సివిల్ కేసులతో పాటు రాజీకి లోబడే క్రిమినల్ కేసులను కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే కోర్టులో పెండింగ్లో లేని ప్రీ-లిటిగేషన్ కేసులను కూడా రాజీ ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పోలీసులు, న్యాయవాదులు కలిసి ఎక్కువ సంఖ్యలో కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం అయ్యేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి, జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ, శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, అలాగే శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

