Thursday, 12 February 2026
  • Home  
  • లాక్ డౌన్ దెబ్బకు ఇండియాలో ఏం జరగబోతుంది..!!
- Featured

లాక్ డౌన్ దెబ్బకు ఇండియాలో ఏం జరగబోతుంది..!!

రాపూరు, మే 20, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సన్ ఫ్లవర్ నూనె, పల్లీ నూనె మార్చి 22కి ముందు ఒక లీటర్ 115ఉండేది..ఈరోజు 160 రూపాయలు..మరి ఈ మధ్య కాలంలో ఏం పెరిగిందని అంత రేట్ పెరిగింది..లేబర్ కూలీ రేట్ పెరగలేదు..ట్రాన్స్ పోర్ట్ ఛార్జ్ పెరగలేదు..పంట మధ్దతు ధర పెరగలేదు..షాపు అద్దె పెరగ లేదు. కరెంట్ ఛార్జీలు పెరగలేదు.అయినా అంత ధర పెరగడం వెనక కేవలం జనాల డిమాండ్ తప్ప ఇంకేం ఉంది.మరి ఇదే డిమాండ్ కూరగాయలకు, పండ్లకు కూడా ఉంది.అయితే వాటిని నిత్యావసర సరుకులు అని చెప్పి వాటికో ధరను నిర్ధేశించి అంతకంటే ఎక్కువ ధరకు అమ్మవధ్ధని ఒక వేళ హధ్ధు మీరితే చట్టప్రకారం శిక్షార్హులు అని చెప్పారు.నిజానికి ఇవి రెండు మూడు రోజులకంటే ఎక్కువ నిల్వ ఉంచి డిమాండ్ క్రియేట్ చేయగలిగే వస్తువులు కూడా కాదు.మరి ఇలానే పెద్ద పెద్ద కంపెనీలలో ఉత్పత్యి అయ్యే ఇతర నిత్యావసర సరుకుల ధరలను కూడా అదుపులో ఉంచాలి కదా.ఇవి కృత్రిమ డిమాండ్ సృష్ఠించేందుకు అవకాశం ఉన్నవే…ఎన్ని రోజులైనా నిల్వ ఉంచే అవకాశం ఉన్న ఇలాంటి సరుకుల విషయంలో ఎందుకుండదు.దీన్ని బట్టి పేదోడు అమ్మే వస్తువుల మీద అదుపు ఉంటుంది తప్ప పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు అమ్మే వస్తువుల మీద ప్రభుత్వాలకు అదుపు ఉండదు అని అర్థమౌతుంది.ఇక వచ్చే రోజులలో బతుకు దుర్భరమై ఈ ధరల పెరుగుదలను భరించలేక కార్మికులు జీతాలు పెంచమనో కూలీ రేట్ పెంచమనో ఉద్యోగులు తమ జీతాలను పెంచమనో డిమాండ్ చేస్తే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తూ రోజుకు 12 గంటలు కాదు.రోజంతా పనిచేయాలనే చట్టాలు కూడా చేస్తారనిపిస్తుంది..ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి కూడా.ఈ లాక్ డౌన్ వలన వస్తువుల ఉత్పత్తి లేదన్నది ఎంత నిజమో.వాటికి డిమాండ్ కూడా లేదన్నది అంతే నిజం ప్రపంచంలో అత్యంత ఎక్కువగా వస్తువులను వినియోగించే అభివృధ్ధి చెందిన దేశాలలో ఇప్పటికీ లాక్ డౌన్ కొనసాగుతుంటే భారత్ లాంటి పేద దేశాలలో ఆ వస్తువులకు డిమాండ్ బాగా తగ్గాలి కాని ధరలు పెరగడం ఏంటి ? ఇక పెట్రోల్ బారెల్ ధర ఉత్పత్తి పెరిగి పోయి డిమాండ్ పూర్తిగా తగ్గిపోవడంతో నెగెటివ్ లో పడింది…నెగెటివ్ అంటే పెట్రోల్ ఉచితంగా ఇవ్వడమే కాక ట్రాన్స్ పోర్ట్ ఖర్చు కూడా ఆయిల్ రిఫైనరీసే భరిస్తాయని అర్థం.పేదోన్ని కొట్టి ఉన్నోడికి పెట్టేందుకే ఈ లాక్ డౌన్ ఉధ్దేశ్యం అని కనపడుతుంది తప్ప జనాల మీద ప్రేమతో కాదేమోననే సందేహం మాత్రం బలంగా వినిపిస్తుంది.ప్రజలకున్న ఈ ప్రాణభయాన్ని సాకుగా తీసుకుని లాక్ డౌన్ చేసి భారత్ లో ఉన్న అన్ని కార్మిక చట్టాలను వినియోగదారుల చట్టాలను లేబర్ హక్కులను మానవ హక్కులను కాలరాసే వ్యూహమే కనపడుతుంది.ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు మద్యం ధరలను అమాంతం పెంచేసాయి…ఇక ఢిల్లీ అయితే ఏకంగా ఫెట్రోల్ ధరలను పెంచి ఆ పెంచిన దాన్ని కరోనా టాక్స్ పేరుతో వసూలు చేయడం గమనార్హం.మీరిప్పటికైనా కరోనాకు భయపడి జనాలని భయపెట్టడం మానేయండి.ముందు ముందు అన్ని రకాల వస్తువుల ధరలు 200% పెరగబోతున్నాయి అలానే పైకి కనపడని పరోక్ష పన్నులు కూడా పెరగబోతున్నాయి కాని ఒక్క వ్యక్తి కూలీ కాని జీతం కాని పెరగబోవడం లేదు..!!

రాపూరు, మే 20, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సన్ ఫ్లవర్ నూనె, పల్లీ నూనె మార్చి 22కి ముందు ఒక లీటర్ 115ఉండేది..ఈరోజు 160 రూపాయలు..మరి ఈ మధ్య కాలంలో ఏం పెరిగిందని అంత రేట్ పెరిగింది..లేబర్ కూలీ రేట్ పెరగలేదు..ట్రాన్స్ పోర్ట్ ఛార్జ్ పెరగలేదు..పంట మధ్దతు ధర పెరగలేదు..షాపు అద్దె పెరగ లేదు. కరెంట్ ఛార్జీలు పెరగలేదు.అయినా అంత ధర పెరగడం వెనక కేవలం జనాల డిమాండ్ తప్ప ఇంకేం ఉంది.మరి ఇదే డిమాండ్ కూరగాయలకు, పండ్లకు కూడా ఉంది.అయితే వాటిని నిత్యావసర సరుకులు అని చెప్పి వాటికో ధరను నిర్ధేశించి అంతకంటే ఎక్కువ ధరకు అమ్మవధ్ధని ఒక వేళ హధ్ధు మీరితే చట్టప్రకారం శిక్షార్హులు అని చెప్పారు.నిజానికి ఇవి రెండు మూడు రోజులకంటే ఎక్కువ నిల్వ ఉంచి డిమాండ్ క్రియేట్ చేయగలిగే వస్తువులు కూడా కాదు.మరి ఇలానే పెద్ద పెద్ద కంపెనీలలో ఉత్పత్యి అయ్యే ఇతర నిత్యావసర సరుకుల ధరలను కూడా అదుపులో ఉంచాలి కదా.ఇవి కృత్రిమ డిమాండ్ సృష్ఠించేందుకు అవకాశం ఉన్నవే…ఎన్ని రోజులైనా నిల్వ ఉంచే అవకాశం ఉన్న ఇలాంటి సరుకుల విషయంలో ఎందుకుండదు.దీన్ని బట్టి పేదోడు అమ్మే వస్తువుల మీద అదుపు ఉంటుంది తప్ప పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు అమ్మే వస్తువుల మీద ప్రభుత్వాలకు అదుపు ఉండదు అని అర్థమౌతుంది.ఇక వచ్చే రోజులలో బతుకు దుర్భరమై ఈ ధరల పెరుగుదలను భరించలేక కార్మికులు జీతాలు పెంచమనో కూలీ రేట్ పెంచమనో ఉద్యోగులు తమ జీతాలను పెంచమనో డిమాండ్ చేస్తే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తూ రోజుకు 12 గంటలు కాదు.రోజంతా పనిచేయాలనే చట్టాలు కూడా చేస్తారనిపిస్తుంది..ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి కూడా.ఈ లాక్ డౌన్ వలన వస్తువుల ఉత్పత్తి లేదన్నది ఎంత నిజమో.వాటికి డిమాండ్ కూడా లేదన్నది అంతే నిజం ప్రపంచంలో అత్యంత ఎక్కువగా వస్తువులను వినియోగించే అభివృధ్ధి చెందిన దేశాలలో ఇప్పటికీ లాక్ డౌన్ కొనసాగుతుంటే భారత్ లాంటి పేద దేశాలలో ఆ వస్తువులకు డిమాండ్ బాగా తగ్గాలి కాని ధరలు పెరగడం ఏంటి ? ఇక పెట్రోల్ బారెల్ ధర ఉత్పత్తి పెరిగి పోయి డిమాండ్ పూర్తిగా తగ్గిపోవడంతో నెగెటివ్ లో పడింది…నెగెటివ్ అంటే పెట్రోల్ ఉచితంగా ఇవ్వడమే కాక ట్రాన్స్ పోర్ట్ ఖర్చు కూడా ఆయిల్ రిఫైనరీసే భరిస్తాయని అర్థం.పేదోన్ని కొట్టి ఉన్నోడికి పెట్టేందుకే ఈ లాక్ డౌన్ ఉధ్దేశ్యం అని కనపడుతుంది తప్ప జనాల మీద ప్రేమతో కాదేమోననే సందేహం మాత్రం బలంగా వినిపిస్తుంది.ప్రజలకున్న ఈ ప్రాణభయాన్ని సాకుగా తీసుకుని లాక్ డౌన్ చేసి భారత్ లో ఉన్న అన్ని కార్మిక చట్టాలను వినియోగదారుల చట్టాలను లేబర్ హక్కులను మానవ హక్కులను కాలరాసే వ్యూహమే కనపడుతుంది.ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు మద్యం ధరలను అమాంతం పెంచేసాయి…ఇక ఢిల్లీ అయితే ఏకంగా ఫెట్రోల్ ధరలను పెంచి ఆ పెంచిన దాన్ని కరోనా టాక్స్ పేరుతో వసూలు చేయడం గమనార్హం.మీరిప్పటికైనా కరోనాకు భయపడి జనాలని భయపెట్టడం మానేయండి.ముందు ముందు అన్ని రకాల వస్తువుల ధరలు 200% పెరగబోతున్నాయి అలానే పైకి కనపడని పరోక్ష పన్నులు కూడా పెరగబోతున్నాయి కాని ఒక్క వ్యక్తి కూలీ కాని జీతం కాని పెరగబోవడం లేదు..!!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.