తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా కాంట్రాక్టర్లకు రూ.18 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఐఏ) తెలిపింది. కాంట్రాక్టర్లు, బిల్డర్లు తమ ఆస్తులను తాకట్టు పెట్టి, అధిక వడ్డీకి రుణాలు తెచ్చి నిర్మాణ పనులు చేస్తున్నారని, వారిని ఈ ప్రభుత్వం రోడ్డున పడేస్తుందని అసహనం వ్యక్తం చేశారు బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే, డిసెంబర్ 1వ తేదీ నుండి అన్ని ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న నిర్మాణ పనులను ఆపేస్తామని హెచ్చరించింది బీఐఏ.
తెలంగాణ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు, బిల్డర్లు అల్టిమేటం జారీ చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని, లేదంటే డిసెంబర్ 1 నుండి అన్ని పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు.


