రైల్వేఅండర్ బ్రిడ్జి సంవత్సరాలు గడుస్తున్నా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో, అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నది
రైల్వేకోడూరు మెదక్ న్యూస్
రైల్వే కోడూరు మండలం
కె- బుడుగుంటపల్లె పంచాయతీ పరిధిలో మరియు చుట్టుపక్కల దాదాపు 30 గ్రామాల పైచిలుకు ప్రజలు రాకపోకలు సాగించడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో, కొన్ని దశాబ్దాల కళ రైల్వే అండర్ బ్రిడ్జి, కానీ సంవత్సరాలు గడుస్తున్నా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో, అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జిని మనం గమనించవచ్చు. కేంద్ర ప్రభుత్వంలోని మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా దేశంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్న పరిస్థితుల్లో మన కోడూరు దానికి భిన్నంగా ఉంది, కావున బిజెపి రైల్వే కోడూరు మండల శాఖ తరపున మీము అభ్యర్తించేది ఒక్కటే అధ్వానంగా ఉన్న అండర్ బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తిచేసి ఆ 30 గ్రామాల ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు సాగించే విధంగా వీలు కల్పించాలని కోరుకుంటున్నాము.
ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు మండల అధ్యక్షులు సాయం శ్రీధర్, రాష్ట్ర కిసాన్ మోర్చా మాజీ కన్వీనర్ తోట శ్రీనివాసులు, కిసాన్ మోర్చా అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ వర్మ, వీహెచ్ పి దరిశ వెంకటరెడ్డి, మండల ఆఫీస్ సెక్రటరీ అందరివాడు సుబ్బారావు ఇతరులు పాల్గొన్నారు.


