జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. పలు ప్రాంతాల్లో ధాన్య రాశులను పరిశీలించిన ఆయన, గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తేమ పేరుతో అధిక బరువు చూపించి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు లేక, గోనె సంచులు, రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పెరిగాయని అన్నారు. వెంటనే మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Uploaded Video:



