ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి
ఖమ్మం బీజేపీ శ్రేణులు ఆదివారం నాడు స్థానిక పేవిలియన్కాం మైదానం నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగినది కోటేశ్వరరావు మాట్లాడుతు
బీహార్ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ ఇండియా కూటమి నాయకులు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లి గారిని దుర్భాషలాడిన వారిపై చట్ట పరమైన చర్య తీసుకొని రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు . నిరసన ర్యాలీ చేసి అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మని దగ్ధం చేయటం జరిగింది ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులని అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది ఈ కార్యక్రమంలో సన్నే ఉదయ్ ప్రతాప్, అల్లిక అంజయ్య సుదర్శన్ధ మిశ్రా నియాకుల వెంకట నారాయణ, శ్రీమతి పమ్మి అనిత, శ్రీమతి మణి, శ్రీమతి దార్ల మల్లీశ్వరి, శ్రీమతి విజయరెడ్డి, గుత్త వెంకటేశ్వర్లు, కొణతం లక్ష్మి నారాయణ, వీరేలి రాజేష్, గడీల నరేష్ కుమిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

