ఖమ్మం పున్నమి ప్రతినిధి
(చింత కానీ మండలం)
👉🏽ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి పైన రాహుల్ గాంధీ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలనీ తీవ్రంగా ఖండిస్తున్నాం.
👉🏽రాహుల్ గాంధీ క్షమాపణ వెంటనే చెప్పాలి.: కొండా గోపి
బిజెపి మండల అధ్యక్షులు కొండా గోపి మాట్లాడుతూ తల్లి ఎవరికైనా తల్లి అని,ఒక తల్లిని తిడితే ఊరుకునే ప్రసక్తే లేదు,బీహార్ రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లలో బిహార్ ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ వాళ్ళు ఓటరు జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు,మరి రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ ఓట్ల ద్వారా గెలవలేదా అని బీజేపీ ఆరోపించింది,దీనిపై కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి మోడీ గారి అమ్మగారిని విమర్శిస్తూ నోటికి వచ్చిన విధంగా దూషించడం జరిగింది,దీనిపై బీజేపీ నాయకుల స్పందించి చింతకాని మెయిన్ సెంటర్ లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలి అని ప్రయత్నిస్తుండగా పోలీసులు రంగ ప్రవేశం చేసి బిజెపి నాయకుల్ని అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసుల తీరును, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు గుగులోత్ నాగేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శిలు గోదా మంగయ్య, ఇమ్మడి సత్యనారాయణ సీనియర్ నాయకులు కోరిపల్లి శ్రీను గారు, చెన్నూరి నాగచారి, ఉపాధ్యక్షలు బక్క సత్యమూర్తి,ch కృష్ణ, యువ మోర్చా మండల అధ్యక్షులు సత్తెనపల్లి గోపి, పులి ప్రవీణ్ సాయి తదితరులు బిజెపి మండల నాయకులు పాల్గొన్నారు.

