రాపూరు, మే 14, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : ఎంత సంపాదించామన్నది కాదు ఆ సంపాదించినదానిలో రాపూరు మండల ప్రజలకు ఎంతో కొంత సమయం చేయడమే తనకెంతో సంతృప్తినిస్తుందని రాపూరు మాజీ ఎంపీపీ, మండల వైకాపా కన్వీనర్ బండి క్రిష్ణా రెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు.కరోనా లాక్ డౌన్ విధించినప్పటి నుంచి మండల ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి రాపూరు మండలంలోని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదన్న ఉదేశ్యంతో మండలంలో పలు సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పేదలకు అండగా నిలుస్తూ వస్తున్నారు.ఇప్పటికే లాక్ డౌన్ విధించినప్పటి నుంచి మండలంలోని ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకుల, కూరగాయలు, గుడ్లు పంపిణీ చేస్తూ తన ఉదరతను చాటుకుంటునారు,అలాగే ఆకలితో అలాంటిస్తున్న వారిని గుర్తించి వారికి భోజనానికి అయ్యే ఖర్చు భరిస్తూ వారికి ఆకలి తిరుస్తున్నారు.ఇందులో భాగంగా గురువారం ఐదోవ రోజు మండలంలోని సిద్దవరం పంచాయతీలో 675 కుటుంబాలకు 8100 గుడ్లు పంపిణీ చేశారు.గత ఐదు రోజులు నుంచి మండలంలో అలుపెరుగ కుండా ఉద్యమంలా ఇంటింటికి గుడ్లు పంపిణీ చేస్తున్న బండి వేణుగోపాల్ రెడ్డి పై మండల ప్రజలు అభినందల వర్షం కురిపిస్తున్నారు.ఈ సందర్భంగా బండి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాపూరు మండల ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడు ముందుటానన్ని తెలిపారు.లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి సహకారం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిద్దవరం మాజీ సర్పంచి కయ్యురు మురళి మోహన్ రెడ్డి,బండి వెంకటరెడ్డి,రామ్మోహన్ రెడ్డి,యూటీఎఫ్ నాయకులు పింగాణీ హరిప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు.
రాపూరు మండల ప్రజలకు అండగా నిలుస్తున్న బండి వేణుగోపాల్ రెడ్డి
రాపూరు, మే 14, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : ఎంత సంపాదించామన్నది కాదు ఆ సంపాదించినదానిలో రాపూరు మండల ప్రజలకు ఎంతో కొంత సమయం చేయడమే తనకెంతో సంతృప్తినిస్తుందని రాపూరు మాజీ ఎంపీపీ, మండల వైకాపా కన్వీనర్ బండి క్రిష్ణా రెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు.కరోనా లాక్ డౌన్ విధించినప్పటి నుంచి మండల ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి రాపూరు మండలంలోని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదన్న ఉదేశ్యంతో మండలంలో పలు సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పేదలకు అండగా నిలుస్తూ వస్తున్నారు.ఇప్పటికే లాక్ డౌన్ విధించినప్పటి నుంచి మండలంలోని ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకుల, కూరగాయలు, గుడ్లు పంపిణీ చేస్తూ తన ఉదరతను చాటుకుంటునారు,అలాగే ఆకలితో అలాంటిస్తున్న వారిని గుర్తించి వారికి భోజనానికి అయ్యే ఖర్చు భరిస్తూ వారికి ఆకలి తిరుస్తున్నారు.ఇందులో భాగంగా గురువారం ఐదోవ రోజు మండలంలోని సిద్దవరం పంచాయతీలో 675 కుటుంబాలకు 8100 గుడ్లు పంపిణీ చేశారు.గత ఐదు రోజులు నుంచి మండలంలో అలుపెరుగ కుండా ఉద్యమంలా ఇంటింటికి గుడ్లు పంపిణీ చేస్తున్న బండి వేణుగోపాల్ రెడ్డి పై మండల ప్రజలు అభినందల వర్షం కురిపిస్తున్నారు.ఈ సందర్భంగా బండి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాపూరు మండల ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడు ముందుటానన్ని తెలిపారు.లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి సహకారం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిద్దవరం మాజీ సర్పంచి కయ్యురు మురళి మోహన్ రెడ్డి,బండి వెంకటరెడ్డి,రామ్మోహన్ రెడ్డి,యూటీఎఫ్ నాయకులు పింగాణీ హరిప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు.

