పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నెల్లూరు లోని మినీ టౌనహాలు నందు ‘ రాచపాళి రత్నావళి ‘ పద్యాలు ఆడియో విడుదల మరియు బహుజన మహనీయుల చిత్రపటాల ప్రదర్శన ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మేరాయువ భారత్ జిల్లా అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ నేటి యువతరానికి మహనీయుల చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉంది. బహుజనుల చిత్ర పటాలను చూపించడం చాలా సంతోషమని తెలిపారు. యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్య నిర్వహణాధికారి ఎ. నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్న నిర్వాహకులు మురళీమోహన్ రాజు, రాచపాలెం ఎంతో అభినందనీయులని వివరించారు. ఈసందర్భంగా సంగీత దర్శకులు దారా సురేష్, గాయకులు ఆకుతోట రమణయ్య లను సత్కరించారు. ఈకార్యక్రమంలో షేక్ రియాజ్ బాషా, అందె శ్రీనివాసులు, పాల జోష్న, అరవ రాయప్ప, మిరియాల రమణయ్య, దయాకర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కళాకారులు, పురప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

” రాచపాళి రత్నావళి ” ఆడియో విడుదల
పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నెల్లూరు లోని మినీ టౌనహాలు నందు ‘ రాచపాళి రత్నావళి ‘ పద్యాలు ఆడియో విడుదల మరియు బహుజన మహనీయుల చిత్రపటాల ప్రదర్శన ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మేరాయువ భారత్ జిల్లా అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ నేటి యువతరానికి మహనీయుల చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉంది. బహుజనుల చిత్ర పటాలను చూపించడం చాలా సంతోషమని తెలిపారు. యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్య నిర్వహణాధికారి ఎ. నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్న నిర్వాహకులు మురళీమోహన్ రాజు, రాచపాలెం ఎంతో అభినందనీయులని వివరించారు. ఈసందర్భంగా సంగీత దర్శకులు దారా సురేష్, గాయకులు ఆకుతోట రమణయ్య లను సత్కరించారు. ఈకార్యక్రమంలో షేక్ రియాజ్ బాషా, అందె శ్రీనివాసులు, పాల జోష్న, అరవ రాయప్ప, మిరియాల రమణయ్య, దయాకర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కళాకారులు, పురప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

