శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడింగ్ యూనియన్ నాయకుడు, ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ ఎం. రమేష్ ఆకస్మికంగా మరణించారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆయన నివాసానికి చేరుకుని రమేష్ పార్థివదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రమేష్ పార్టీ పట్ల, కార్మిక విభాగం పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత వాయులింగేశ్వర స్వామిని ప్రార్థించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు ధైర్యం చెప్పారు. రమేష్ మృతికి నివాళులర్పించిన వారిలో , శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అంజూరు తారక శ్రీనివాసులు, పఠాన్ ఫరీద్, షేక్ జిలానీ బాషా, సాధన మున్నా రాయల్, పలువురు పార్టీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు. వీరంతా రమేష్ కుటుంబానికి తమ సానుభూతిని ప్రకటించారు.

రమేష్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైసీపీ శ్రేణులు
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడింగ్ యూనియన్ నాయకుడు, ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ ఎం. రమేష్ ఆకస్మికంగా మరణించారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆయన నివాసానికి చేరుకుని రమేష్ పార్థివదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రమేష్ పార్టీ పట్ల, కార్మిక విభాగం పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత వాయులింగేశ్వర స్వామిని ప్రార్థించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు ధైర్యం చెప్పారు. రమేష్ మృతికి నివాళులర్పించిన వారిలో , శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అంజూరు తారక శ్రీనివాసులు, పఠాన్ ఫరీద్, షేక్ జిలానీ బాషా, సాధన మున్నా రాయల్, పలువురు పార్టీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు. వీరంతా రమేష్ కుటుంబానికి తమ సానుభూతిని ప్రకటించారు.

