Friday, 20 February 2026
  • Home  
  • రంగుల వెల్లువలో శ్రీకాళహస్తీశ్వరుడు.. కనువిందుగా వసంతోత్సవ వేడుకలు.
- తిరుపతి

రంగుల వెల్లువలో శ్రీకాళహస్తీశ్వరుడు.. కనువిందుగా వసంతోత్సవ వేడుకలు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు స్వామి, అమ్మవార్ల ‘వసంతోత్సవం’ అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగింది. ప్రకృతి పరవశించేలా, భక్తుల తన్మయత్వం మధ్య జరిగిన ఈ రంగుల వేడుకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని సంతరించుకున్నాయి. వసంత ఋతువు రాకకు సంకేతంగా, లోక కల్యాణార్థం నిర్వహించిన ఈ వేడుకలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా సుగంధ ద్రవ్యాలు కలిపిన పసుపు, కుంకుమలు, వసంత తీర్థాన్ని స్వామివారిపై చిలకరించి ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులు ఒకరిపై ఒకరు వసంతాలు చల్లుకుంటూ ‘హర హర మహాదేవ’ శంభో శంకర’ స్మరణతో ముక్కంటి క్షేత్రాన్ని మారుమోగించారు. బ్రహ్మోత్సవాల ముగింపు దశలో జరిగే ఈ వసంతోత్సవంలో పాల్గొంటే సకల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. అందుకే స్థానిక భక్తులతో పాటు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన యాత్రికులు కూడా పెద్ద ఎత్తున ఈ రంగుల కేళిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి అద్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, పాలక మండలి సబ్యులు ఆలయ ఈఓ, అధికారులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు స్వామి, అమ్మవార్ల ‘వసంతోత్సవం’ అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగింది. ప్రకృతి పరవశించేలా, భక్తుల తన్మయత్వం మధ్య జరిగిన ఈ రంగుల వేడుకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని సంతరించుకున్నాయి. వసంత ఋతువు రాకకు సంకేతంగా, లోక కల్యాణార్థం నిర్వహించిన ఈ వేడుకలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా సుగంధ ద్రవ్యాలు కలిపిన పసుపు, కుంకుమలు, వసంత తీర్థాన్ని స్వామివారిపై చిలకరించి ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులు ఒకరిపై ఒకరు వసంతాలు చల్లుకుంటూ ‘హర హర మహాదేవ’ శంభో శంకర’ స్మరణతో ముక్కంటి క్షేత్రాన్ని మారుమోగించారు. బ్రహ్మోత్సవాల ముగింపు దశలో జరిగే ఈ వసంతోత్సవంలో పాల్గొంటే సకల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. అందుకే స్థానిక భక్తులతో పాటు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన యాత్రికులు కూడా పెద్ద ఎత్తున ఈ రంగుల కేళిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి అద్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, పాలక మండలి సబ్యులు ఆలయ ఈఓ, అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.